ఉత్పలమాల
సంచితపుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితు డైన వాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబు లందు వెలుఁగించి సమస్తజగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరగు భారతసంహితఁ జేసె నున్నతిన్.
(వ్యాసుడు వేదాలను విభజించి, వాటిని లోకాలలో ప్రకాశింపజేసి, పంచమవేదమనే పేరుతో ప్రసిద్ధి చెందిన భారతసంహితను రచించాడు.)
No comments:
Post a Comment