వచనము
పరాశరుండును సత్యవతి కోరినవరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజినపరిధానకపిలజటామండలదండకమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుం బని గల యప్పుడ నన్నుం దలంచునది యాక్షణంబ వత్తునని సకలలోక పావనుఁ డఖిలలోకహితార్థంబుగాఁ దపోవనంబునకుం జని యందు మహా ఘోరతపంబు సేయుచు.
(పరాశరుడు సత్యవతి కోరిన వరాలిచ్చి వెళ్లిపోయాడు. వ్యాసుడు తల్లి ముందు నిలిచి, "మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే వస్తాను", అని చెప్పి తపస్సు చేయటానికి వెళ్లిపోయాడు.)
No comments:
Post a Comment