చంపకమాల
వినుత యశుండు పాండు నృప వీరుఁడు దిగ్విజయంబు సేసి పెం
పునఁ గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా
రని విభవంబుతోడ ధృతరాష్ట్రుఁడు సేసె శతాశ్వమేధముల్
దని సన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్.
(పాండురాజు తెచ్చిన ధనంతో ధృతరాష్ట్రుడు వంద అశ్వమేధయాగాలు చేశాడు.)
No comments:
Post a Comment