వచనము
ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యుఁ గోపపాశబద్ధుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె నంత నిట ధృతరాష్ట్రుండు యుధిష్ఠిరురాజ్యభారధురంధరుంగా నెఱింగి భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన.
(ఇలా ద్రోణుడు విడిచిపెట్టినా, అతడు చేసిన అవమానానికి తిరిగి అవమానం చేయాలని ద్రుపదుడు ఆలోచించసాగాడు. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యౌవరాజ్యాభిషేకం చేశాడు.)
No comments:
Post a Comment