చంపకమాల
నలువురు దమ్ములున్ బలిమి నాలుగుదిక్కులు నోర్చి సర్వభూ
తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరివస్తురా
సులు గొనివచ్చి యీఁగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం
డలఘుఁడు యౌవరాజ్యయుతుఁ డయ్యును బెంపున సార్వభౌముఁ డై.
(తన నలుగురు తమ్ములు, నాలుగు దిక్కులు జయించి ఇతర రాకుమారుల నుండి కప్పం తెచ్చి ఇవ్వగా, ధర్మరాజు యువరాజే అయినా చక్రవర్తిలా వెలిగాడు.)
No comments:
Post a Comment