వచనము
అని పంచినం బురోచనుం డతి త్వరితగతి నరిగి దుర్యోధను కఱపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు రచియించుచుండె నిట యుధిష్ఠిరభీమార్జునయములుం గ్రమంబునం దొల్లి షోడశపంచదశచతుర్దశత్రయోదశవర్షజాతు లయి శతశృంగంబుననుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి యస్త్రవిద్యలం గఱచుచుం బదమూడేం డ్లుండి యపుడు ధృతరాష్ట్రు నియోగంబున వారణావతం బునకు జననీసహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కి ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్త్రియప్రముఖానేక జనంబులు శోకసంతప్తహృదయు లయి.
(పురోచనుడు అలాగే వారణావతానికి వెళ్లి లక్క ఇల్లు నిర్మించసాగాడు. పాండవులు వారణావతానికి వెళ్లే సమయంలో హస్తినాపురం లోని ప్రజలు దుఃఖంతో.)
No comments:
Post a Comment