సీసము
ఇప్పాండుపుత్త్రుల నేలకో ధృతరాష్ట్రుఁ
డేకత మనుపంగ నిచ్చగించె
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు
లేల వారింపరో యెఱుఁగరొక్కొ
పితృపితామహులచే భృతపూర్వమై క్రమా
గత మైన రాజ్యంబుఁ గరము నెమ్మిఁ
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు
ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి
ఆటవెలది
యేల వృద్ధరాజు లెడసేసిరో పార్థుఁ
డరుగు నెడక మనము నరిగి యతని
యున్నచోన ప్రీతి నుండుద మిం దుండ
నేల యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి.
(ధృతరాష్ట్రుడు పాండవులను హస్తిన నుండి పంపుతున్నప్పుడు భీష్ముడు మొదలైన పెద్దలు ఎందుకు అడ్డగించలేదో? ధర్మరాజుకు రాజ్యాధికారం ఎందుకు దూరం చేశారో? మనం కూడా ధర్మరాజు వెళ్లే చోటికే వెళ్లి ఉందాం - అని బయలుదేరారు.)
No comments:
Post a Comment