వచనము
తన పిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మ విరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయివచ్చెద మని యందఱం గ్రమ్మఱించి చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి విదురుం డొరులు వినియును నెఱుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనావిశారదుం డైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి కొడుకులం గౌఁగిలించుకొని కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱిచనియె నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యిట్లనియె.
(వారిని ఓదార్చి వెడుతున్న ధర్మరాజు దగ్గరకు విదురుడు వెళ్లి, ఇతరులు విన్నా వారికి అర్థం కాని మాటలతో మాటనేర్పరి అయిన ధర్మరాజుకు వారణావతంలో చేయవలసిన పనులు బోధించి వెనుదిరిగాడు. తరువాత కుంతీదేవి ధర్మరాజుతో ఇలా అన్నది.)
No comments:
Post a Comment