తేటగీతి
అనఘచరితుఁడు మాయన్న వనములోనఁ
జనుచు నొక్కనాఁ డొక్కపం డొనరఁ గాంచి
కొనియె శుచి యగు శుచియుఁ గా దని యెఱుంగఁ
బడని భూమి తలంబుపైఁ బడినదాని.
(మా అన్న యాజుడు ఒకరోజు అడవిలో వెడుతూ నేలమీద పడిన ఒక పండును చూసి, అది శుభ్రమైనదో కాదో తెలియకపోయినా, దాన్ని తీసుకువచ్చాడు.)
No comments:
Post a Comment