సీసము
ఇంద్రసమానున కిందీవరశ్యామ
సుందరాంగున కింద్రనందనునకు
దేవిఁగాఁ బ్రీతితో దీని నీఁ గాంచితి
నని యున్నచో విధాతృనకు నిట్లు
పాడియే విఘ్న మాపాదింప నమ్మహా
ధ్వరమునఁ బుట్టిన సరసిజాక్షి
నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఃఖ
పరవశుఁడయి యున్న ధరణిపతికిఁ
ఆటవెలది
దత్పురోహితుండు దా నిట్టు లనియె న
ప్పాండవులనుగుఱిచి బహువిధంబు
లగు నిమిత్తములు నయంబునఁ జూచితి
నెగ్గు లేదు వారి కెల్ల లగ్గు.
(నల్లని శరీరం కల అర్జునుడికి కృష్ణను భార్యగా ఇవ్వాలనుకుంటే ఇలా జరగటం న్యాయమా? ద్రౌపదిని ఇతరులకు ఎలా ఇవ్వగలను? - అని ద్రుపదుడు దుఃఖించాడు. అప్పుడు అతడి పురోహితుడు ఇలా అన్నాడు - పాండవుల గురించి శుభశకునాలను చూశాను. వారికి కీడు లేదు.)
No comments:
Post a Comment