వచనము
తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం గావున నేను నుపశ్రుతిం జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున నున్నవారు వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం బనినం బురోహితువచనంబునంజేసి యూఱడి ద్రుపదుండు నేఁటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి.
(నేను శుభశకునాలను చూశాను. పాండవులు మరణించలేదు. స్వయంవరం చాటించు. వాళ్లు ఎక్కడున్నా ఇక్కడికి వస్తారు - అనగా ద్రుపదుడు అలాగే ప్రకటించాడు.)
No comments:
Post a Comment