సీసము
తా నొక్క మునికన్య దనకర్మవశమునఁ
బతిఁ బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన
దానికి శివుఁడు ప్రత్యక్ష మయ్యు
వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన
మని యేనుమాఱు లయ్యబల వేఁడె
నట్లేని నీకు దేహాంతరంబునఁ బతు
లగుదు రేవురు పరమార్థ మనియు
ఆటవెలది
హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల
పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది తత్స్వయం
వరము సేయుచున్నవాఁడు నేఁడు.
(ఒక మునికన్య భర్తకోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. ఆమె సంతోషంచో పతిదానం ఇమ్మని ఐదుసార్లు అడిగింది. శివుడు - నీకు మరుసటి జన్మలో భర్తలు ఐదుగురు అవుతారు - అని వరమిచ్చాడు. ఆమె ఇప్పుడు పాంచాలరాజుకు కూతురుగా పుట్టింది. ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈరోజు జరుపుతున్నాడు.)
No comments:
Post a Comment