వచనము
మీరు ద్రుపదుపురంబునకుం జక్కనరుగునది యందు మీకు ల గ్గగు నని చెప్పి కృష్ణద్వైపాయనుం డరిగినఁ బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్లును బయనంబు వోవువా రొక్కనాఁ డర్ధరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్థు లై యర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుంగా నొక్కకొఱవి సేతఁ బట్టుకొని ముందఱం బోవ నందఱు నరుగునెడ నంగారపర్ణుఁ డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్థంబు వచ్చిన వాఁ డప్పాండవుల పాదధ్వని విని యలిగి విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె.
(మీరు ద్రుపదుడి నగరానికి వెళ్లండి - అని చెప్పి వెళ్లాడు. కుంతి, పాండవులు ప్రయాణం చేస్తూ ఉండగా అంగారపర్ణుడనే గంధర్వుడు తన భార్యలతో జలక్రీడలకోసం గంగానదీతీరానికి వచ్చాడు. పాండవుల పాదధ్వనికి కోపించి, ధనుస్సు చేతబట్టి, వారితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment