తేటగీతి
దానికడకుఁ బ్రత్యేకంబ ధర్మవాయు
వాసవాశ్వినుల్ ప్రీతు లై వచ్చి దాని
నాత్మ దేహాంశుజులకు దేహాంతరమునఁ
బత్నిగాఁ గోరి రధిక సౌభాగ్యయుక్తి.
(ఆమె దగ్గరకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు వచ్చి, జన్మాంతరంలో తమ అంశలతో పుట్టేవారికి ఆమె భార్య కావాలని కోరారు.)
No comments:
Post a Comment