వచనము
అదియును గొండొకకాలంబు జలానిలాహార యై కొండొకకాలంబు నిరాహార యై కొండొకకాలం బేకపాదంబున నిల్చి కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు ప్రసన్నుం డయి వరంబు వేఁడు మనిన నక్కన్యక నాకుం బతిదానంబుఁ బ్రసాదింపు మని యర్థిత్వంబున నేనుమాఱులు వేఁడినం గరుణించి యీశ్వరుండు నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు రనిన నది యిట్లనియె.
(ఆమె తపస్సుకు శివుడు ప్రసన్నుడై వరం అనుగ్రహించగా ఆమె - నాకు పతిదానం ప్రసాదించవలసింది - అని ఐదుసార్లు అడిగింది. శివుడు కరుణించి - నీకు జన్మాంతరంలో ఐదుగురు భర్తలవుతారు - అనగా ఆమె ఇలా అన్నది. )
No comments:
Post a Comment