సీసము
హరువచనమున నా గిరిరాజవివరంబు
గరములఁ బట్టి చెచ్చెర దినేశ
చండమయూఖముల్ రెండు విధంబు లై
యుండంగఁ దెర్చి యాఖండలుండు
దనయట్టివారల ఘనశరీరుల నందు
నలువుర నన్యుల వెలయఁ జూచి
యే నిట్టు లేలొకో యేనుప్రకారంబు
లయితి నిం దనుచు విస్మయముఁ బొంది
ఆటవెలది
యున్నఁ జూచి హరుఁడు గ్రన్న నయ్యింద్రుల
నేవురను మహానుభావ మెసఁగ
మనుజయోనిఁ బుట్టుఁ డని పంచె గీర్వాణ
హితము సేయుపొంటె మతిఁ తలంచి.
(ఇంద్రుడు అలాగే ప్రయత్నించి ఆ రంధ్రాన్ని తెరిచి అందులో తనలాంటి శరీరం కలవారు మరో నలుగురు ఉండటం చూసి ఆశ్చర్యపోగా శివుడు ఆ ఐదుగురు ఇంద్రులను - మానవులుగా జన్మించండి - అని ఆజ్ఞాపించాడు.)
No comments:
Post a Comment