వచనము
వారలు ధర్మానిల శక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవు లనంగాఁ బుట్టిరి కమలభవప్రముఖ నిఖిలసురగణ ప్రార్థితుం డయి నారాయణు సితాసిత కేశ ద్వయంబు బలదేవ వాసుదేవులై దేవహితార్థం బుద్భవించిన నందు వాసుదేవుండు వారలకుఁ గార్యసహాయుం డయ్యె నయ్యింద్రుల కేవురకును నేకపత్నిగాఁ దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేనియజ్ఞవేదిం బుట్టె నమ్మవేని వీరల పూర్వదేహంబులఁ జూడు మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన.
(వారు పాండవులుగా జన్మించారు. దేవతల ప్రార్థించగా విష్ణుమూర్తి తెల్లని, నల్లని వెండ్రుకల జంట బలరామకృష్ణులుగా అవతరించారు. వారిలో కృష్ణుడు పాండవులకు సహాయం చేసేవాడయ్యాడు. వారికి భార్యగా ద్రౌపది జన్మించింది. నమ్మకం లేకపోతే వారి పూర్వదేహాలు చూడు - అని ద్రుపదుడికి దివ్యదృష్టిని ఇచ్చి చూపాడు.)
No comments:
Post a Comment