వచనము
అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృంద పరివృతుం డై యున్న పరమేష్ఠికిం బరమభక్తిం బ్రణమిల్లి పనియేమి యని ముందట నిలిచిన నరవిందసంభవుం డాసుందరిం జూచి సుందోపసుందు లను దైత్యులు దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు వార లిద్దరు నీకారణంబునం దమలో నొండొరులతోఁ బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగాఁ జేయు మని పంచిన వల్లె యని.
(బ్రహ్మ ఆమెతో - సుందోపసుందులు నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేలా చెయ్యి - అని ఆజ్ఞాపించగా తిలోత్తమ అలాగేనని.)
No comments:
Post a Comment