వచనము
కళింగవిషయంబు సొచ్చు నంతఁ దోడిబ్రాహ్మణులు కొందఱు కళింగద్వారంబునఁ గ్రమ్మఱి యుత్తరకురుదేశంబులకుం జనిన నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్థుం డరిగి పూర్వసముద్రతీరంబునఁ బురుషోత్తమదేవరకు నమస్కరించి మహేంద్రపర్వతంబు చూచుచు.
(కళింగదేశంలో ప్రవేశించగానే అర్జునుడి వెంట వచ్చినవారిలో కొందరు తిరిగి ఉత్తరకురుదేశాలకు వెళ్లారుయ మిగిలిన వారితో అర్జునుడు తూర్పుసముద్రతీరంలో ఉన్న జగన్నాథస్వామిని సేవించి, మహేంద్రపర్వతం చూస్తూ.)
No comments:
Post a Comment