సీసము
దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన
గోదావరియు జగదాది యైన
భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీ
పర్వతంబును జూచి యుర్విలోన
ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ఠ మై
ధరణీసుతోత్తమాధ్వరవిధాన
పుణ్యసమృద్ధ మై పొలుచు వేంగీదేశ
విభవంబుఁ జూచుచు విభుఁడు దక్షి
తేటగీతి
ణాంబురాశితీరంబున కరిగి దురిత
హారి యైన కావేరీమహాసముద్ర
సంగమంబున భూసురేశ్వరుల కభిమ
తార్థదానంబుఁ జేసి కృతార్థుఁ డగుచు.
(గోదావరిని, భీమేశ్వరాన్ని, శ్రీశైలాన్ని, వేంగీదేశాన్ని చూస్తూ దక్షిణసముద్రతీరానికి వెళ్లి కావేరీసముద్రసంగమంలో దానాలు ఇచ్చాడు.)
No comments:
Post a Comment