వచనము
అని యుధిష్ఠిరుండు వారి యనుమతంబు వడసి తమ్ములు దానును హస్తిపురంబునకుఁ బోవ నిశ్చయించి ద్రుపదు వీడ్కొని ప్రయాణోన్ముఖుం డయ్యె నిట్లు విదురుండు పాండవులఁ బాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవ ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాఁగా వచ్చునంత వారలరాక విని ధృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్సైన్యసమేతు లయి మహోత్సవంబుతోఁ బాండవులు గజపురవ్రవేశంబు సేయునప్పుడు వారలం జూచి.
(అని ధర్మరాజు వారి అనుమతి పొంది హస్తినాపురానికి అందరితో కలిసి వెళ్లగా.)
No comments:
Post a Comment