సీసము
పుర జను లెల్లను గర మనురక్తు లై
ధర్మస్వరూపుఁ డీ ధర్మతనయుఁ
డనుజులుఁ దానును జనుదెంచెఁ బాండుభూ
జనపతి జీవించి మనలఁ గావఁ
బ్రీతితోఁ దా నిప్పు డేతెంచె మే లయ్యె
నిమ్మహాత్ములకుఁ దైవమ్ముఁ బురుష
కారంబుఁ గలుగంగ ధారుణీరాజ్యంబు
వాయునే యాపదల్ వాయుఁగాక
ఆటవెలది
దాన హోమ జప విధానముల్ మన కివి
గలవయేని ధరణివలయరాజ్య
మింద యుండి ధర్మనందనుఁ డొనరించు
చుండుఁ గావుతమ యఖండితముగ.
(ప్రజలంతా పాండవులను చూసి ప్రేమతో ఇలా అనుకొన్నారు - పాండవులు రావటం మనకు మేలైనది. ధర్మరాజు హస్తినాపురంలోనే ఉండి అవిచ్ఛిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండుగాక.)
No comments:
Post a Comment