వచనం
మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ
సూత్ర్తత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబుల యందనర్థకచింత నిశ్చిత కార్యంబులు సేయమి మంత్రంబుల
రక్షింపమి శుభంబులఁ బ్రయోగింపమి విషయంబులం దగులుట యనంబరఁగిన పదునాలుఁగు
రాజదోషంబులఁ బరిహరింతె యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె.
(నాస్తికత, అబద్ధమాడటం, ఏమరుపాటు, సోమరితనం, తెలివితక్కువవాళ్లతో కార్యాలోచన చేయటం, కోపం, ఎక్కువకాలం చింతించటం, చేయవలసిన పనిగురించి ఎక్కువకాలం ఆలోచించటం, ఆలస్యంగా చేయటం, జ్ఢానులను గుర్తించకపోవటం, ప్రయోజనకరమైన విషయాల్లో ప్రయోజనం లేని ఆలోచనలు చేయటం, నిర్ణయించిన పనులు చేయకపోవటం, రహస్యాలు కాపాడుకోలేకపోవటం, శుభకార్యాలు చేయకపోవటం, ఇంద్రియలోలత్వం - అనే పదునాలుగు రాజదోషాలను విడిచిపెట్టావు కదా అన్న నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు)
Saturday, May 30, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment