Saturday, September 19, 2009

2_1_58 వచనం వోలం - వసంత

వచనం

అని కృతాంజలి యయి 'మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లేవెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?' యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె.

(అని, "మునీంద్రా! ఈ మూడులోకాల్లో మీరు చూడనివి లేవు. ఎక్కడైనా ఇలాంటి అపూర్వమైన సభను చూశారా?", అని మయుడు నిర్మించిన ఆ సభను చూపించగా నారదుడు ఆశ్చర్యపోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)

No comments: