Thursday, May 31, 2007

2_1_14 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును ననవరత కుసుమఫలభరితంబు లైన తరువనంబులును వికచకమల కుముదాభిరామంబు లైన జలాశయంబులును వివిధ విచిత్రపతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులునుం గలిగి దశ కిష్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును సహస్రకర ప్రభా ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందుఁ బదునాలుగు నెలలు నిర్మించి దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త్వ సంపన్నుల నంతరిక్షచరులం బనిచి మోపించికొని వచ్చి ధర్మరాజున కిచ్చి గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి ధర్మరాజు చేత సత్కృతుండయి మయుం డరిగిన.

(ఎన్నో యంత్రాలు, తోటలు, కొలనులు అమర్చి ఆ సభను నిర్మించి, బలవంతులైన రాక్షసులచేత ఆ భవనాన్ని మోయించి ధర్మరాజుకు ఇచ్చాడు. భీముడికి గదను, అర్జునుడికి శంఖాన్ని అందించి, ధర్మరాజు వద్ద సన్మానం పొంది వెళ్లాడు.)

No comments: