Thursday, July 06, 2006

1_6_122 వచనము పవన్ - వసంత

వచనము

దాననచేసి పౌర జానపద బ్రాహ్మణ ప్రధాన వరులు ధర్మజున కనురక్తు లయి నిన్నును భీష్ముని నాదరింపక ప్రజ్ఞాచక్షుండు రాజ్యరక్షణంబు సేయ సమర్థుండు గాఁడు భీష్ముండు సమర్థుం డయ్యును ముందఱ రాజ్యభార నివర్తనంబునందుఁ గృతప్రతిజ్ఞుం డయ్యెం గావునఁ బాండవజ్యేష్ఠుం డైన యుధిష్ఠిరునకు రాజ్యాభిషేకంబు సేయుద మతండు తరుణుండయ్యును గుణవృద్ధుండు ధర్మశీలుండు పరాక్రమవంతు లైన తమ్ములుగలవాడు రాజ్యప్రతిష్ఠితుం డయ్యెనేని వృద్ధులనమాత్యులబంధుమిత్రులను దొల్లింటికంటె మిక్కిలిగాఁ బూజార్హుల నెల్లం బూజించుఁ బితామహుండైన భీష్ముని సపుత్త్రకుండైన ధృతరాష్ట్రుని నతిభక్తి నభీష్టభోగానుభవపరులంగా సుఖంబున నునుచు దీనికి విదురుండును నొడంబడునని యెప్పుడుఁ దమలో విచారింతు రని వింటిఁ గర్ణశూలాయమానంబు లైన మూర్ఖప్రకృతుల పలుకులు విననోపఁ బాండవుల నిప్పురంబు వలనఁ బాయునట్లుగాఁ జేయవలయు నేమి సేయుదు ననినఁ గొడుకునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

(ప్రజలు ధర్మరాజు రాజు అవుతాడని ప్రజలు అనుకొంటున్నారు. ఆ మాటలు నేను వినలేను. పాండవులు హస్తినాపురం విడిచివెళ్లేలా చేయండి - అన్నాడు. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.)

No comments: