Wednesday, December 14, 2005

1_4_111 వచనము వసు - వసంత

వచనము

మఱియు నతీతానాగతులైన నిజవంశంబున రాజుల కెల్ల వంశకర్తయయ్యె నట్టిభరతునకుఁ గైకేయియైన సునందకు భుమన్యుండు పుట్టె వానికి నిక్ష్వాకుకన్య యైన సువర్ణకు హస్తి పుట్టెనతని పేరం గౌరవ్యరాజధాని యైన నగరంబు హస్తిపురంబు నా బరగె నట్టి హస్తికిం ద్రిగర్తరాజ పుత్త్రి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె వానికి దాశార్హపుత్త్రియైన వసుదేవకు నజమీఢుండు పుట్టె నయ్యజమీఢునకు గైకేయియు గాంధారియు ఋక్షయు నను మువ్వురు స్త్రీలకు.

(అంతేకాక తన వంశానికి వంశకర్త అయ్యాడు. భరతుడికీ కేకయరాజపుత్రిక అయిన సునందకూ భుమన్యుడు పుట్టాడు. భుమన్యుడికీ దాశార్హుడి కూతురైన విజయకూ సుహోత్రుడు జన్మించాడు.సుహోత్రుడికీ ఇక్ష్వాకుడి కుమార్తె అయిన సువర్ణకూ హస్తి అనేవాడు పుట్టాడు. అతడి పేరుమీద కౌరవుల రాజధాని అయిన "హస్తిపురం" ప్రసిద్ధికెక్కింది. హస్తికీ త్రిగర్తరాజు పుత్రిక అయిన యశోధరకూ వికుంఠనుడు పుట్టాడు. అతడికీ దాశార్హుడి కూతురైన వసుదేవకూ అజమీఢుడు జన్మించాడు. అజమీఢుడికీ కైకేయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గురు స్త్రీలకూ.)

No comments: