Thursday, December 15, 2005

1_4_114 వచనము వసు - వసంత

వచనము

వానిపేరం గురుక్షేత్రంబునాఁ బరగె నట్టి కురునకు దాశార్హియైన శుభాంగికిని విదూరథుండు పుట్టె వానికి మాగధి యైన యమృతకుం బరీక్షితుండు పుట్టె వానికి బహుదానసుత యయిన సుయశకు భీమసేనుండు పుట్టె వానికిం గైకేయి యయిన కుమారికిఁ బ్రదీపుఁడు (బర్యశ్రవసుండు) పుట్టెఁ వానికిఁ బ్రతీపుండు పుట్టెఁ బ్రతీపునకు శిబిపుత్రి యయిన సునందకు దేవాపి శంతను బాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరగిన శంతనుండు రాజయ్యె వానికి గంగాదేవికి దేవవ్రతుండైన భీష్ముండు పుట్టె మఱియు శంతనునకు యోజనగంధియైన సత్యవతికిం జిత్రాంగదవిచిత్రవీర్యులనంగా నిద్దఱు గొడుకులు పుట్టి రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుం డయిన వానికం గొండుకవాని విచిత్రవీర్యు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు కాశీరాజ దుహితల నంబికాంబాలిక లనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన.

(అతడి పేరుమీద కురుక్షేత్రం ప్రసిద్ధికెక్కింది. అతడి వంశంలో శంతనుడు జన్మించాడు. శంతనుడికీ గంగాదేవికీ భీష్ముడు పుట్టాడు. అంతేకాక, శంతనుడికీ యోజనగంధి అయిన సత్యవతికీ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల భీష్ముడు విచిత్రవీర్యుడికి రాజ్యాభిషేకం చేసి కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలిక అనేవారిని అతడికి వివాహం చేశాడు.)

No comments: