Wednesday, December 21, 2005

1_4_122 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి పాండవధార్తరాష్ట్రసంభవంబును సవిస్తరంబుగా వినవలతుం జెప్పుమనిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుం డైన యశ్వమేధసహస్రంబున రాజసూయశతంబునుం జేసి యింద్రాదిదేవతలం దనిపి దేవలోకంబునకుం జని యందు దేవర్షి గణంబులతోఁ బితామహుం గొల్చుచున్న యవసరంబున గంగానది దివ్యస్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన.

(ఇంకా పాండవుల, ధృతరాష్ట్రపుత్రుల పుట్టుక కూడా చెప్పమని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు - పూర్వం ఇక్ష్వాకువంశంలో మహాభిషుడు అనేవాడు పుట్టి చాలా యాగాలు చేసి, దేవతలకు తృప్తి కలిగించి, స్వర్గానికి వెళ్లి, మునిగణాలతో కలిసి బ్రహ్మను సేవిస్తున్న సమయంలో గంగానది దివ్యస్త్రీరూపం ధరించి అక్కడికి వచ్చింది.)

No comments: