Monday, September 04, 2006

1_7_157 వచనము నచకి - వసంత

వచనము

అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి యిచ్చోటికిం గుఱంగట నుత్కచం బను పుణ్య తీర్థంబునం దపంబు సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణునిఁ బురోహితుఁగాఁ బ్రార్థింపుం డమ్మహాత్ముండు మీకుఁ బురోహితుం డైన సర్వార్థసిద్ధి యగు ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి మాకు నీ యిచ్చిన హయంబుల నీయంద సంగ్రహించి యుండుము ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు.

(ఇక్కడికి దగ్గరలో ఉన్న ఉత్కచం అనే తీర్థంలో ఉన్న ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడిని పురోహితుడిగా స్వీకరించండి - అనగా అర్జునుడు సంతోషించి అతడికి ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి - మాకు నువ్వు ఇచ్చిన గుర్రాలను నీ దగ్గరే ఉంచు. అవసరమైనప్పుడు తీసుకొంటాము - అని పాండవులు గంగానదిని దాటి ఆ తీర్థానికి వెళ్లి.)

No comments: