Monday, September 11, 2006

1_7_165 వచనము నచకి - వసంత

వచనము

కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందఱు నమస్కరించి కృతాంజలు లై యున్న వారికి హృదయానందంబుగా సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనినఁ బాండవులును గతిపయ దినంబులకు ద్రుపదుపురంబు సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్ణిల్లి మ్రోయుచుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత మహీనాథుల బహువిధ స్కంధావారంబులఁ జూచుచుం జని యొక్కకుంభకారగృహంబున విడిసి త మ్మెవ్వరు నెఱుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంతఁ బాంచాలపతి పార్థునకుఁ గూఁతు నీ సమకట్టి పాండవుల నన్వేషించి యెందునుం గానక.

(వ్యాసుడు వారికి రానున్న శుభాల గురించి తెలిపి వెళ్లాడు. తరువాత పాండవులు ద్రుపదుడి పట్టణం చేరి ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేశారు. ద్రుపదుడు అర్జునుడికి తన కూతురిని ఇవ్వాలని, పాండవుల కోసం చూసి, వాళ్లను కనిపెట్టలేక.)

No comments: