Friday, October 28, 2005

1_3_41 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

అనిన నమ్మునివరుండు గరంబు సంతసిల్లి నాకు నిష్టంబు సేసిన దాన నీ కన్యాత్వంబు దూషితంబు గా దోడకుండు మని దానికి వరం బిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యంబునం బుట్టిన దానవు గాని సూతకుల ప్రసూతవు కావని చెప్పి దాని శరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడునట్లుగాఁ బ్రసాదించిన నది గంధవతి యనియు యోజనగంధి యనియుఁ బరఁగి తత్ప్రసాదంబున ననేకదివ్యాంబరాభరణభూషిత యై యమునానదీ ద్వీపంబున నోడ చేర్చి.

(అని అనగా పరాశరుడు సంతోషించి, ఆమె కన్యాత్వం పోకుండా వరమిచ్చి, "నువ్వు వసువుకు పుట్టినదానివి కానీ సూతకులంలో పుట్టలేదు", అని తెలిపి, ఆమెకు యోజనదూరంలో ఉండే జనాలకు కూడా తెలిసేలాంటి శరీరసుగంధం అనుగ్రహించాడు. ఆమె అప్పటినుండి గంధవతిగా, యోజనగంధిగా ప్రసిద్ధిచెందింది. ఆమె ఓడను యమునానదిలోని ఒక ద్వీపానికి చేర్చి.)

No comments: