Sunday, October 30, 2005

1_3_65 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు సింహిక యను దానికి రాహువుపుట్టె ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి కపిల యనుదానికి నమృతంబును గోగణంబును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు లయిన యప్సరసలును బుట్టిరి వినత యనుదానికి ననూరుండును గరుడండును బుట్టి రం దనూరునకు శ్యేని యనుదానికి సంపాతిజటాయువులు పుట్టిరి క్రోధ యనుదానికిఁ గ్రోధవశగణంబు పుట్టెఁ బ్రాధ యనుదానికి సిద్ధాదులు పుట్టిరి క్రూర యనుదానికి సుచంద్ర చంద్రహంత్రాదులు పుట్టిరి కద్రువ యనుదానికి శేషవాసుకి పురోగ మానేక భుజంగముఖ్యులు పుట్టిరి.

(సింహికకు రాహువు, మునికి పదహారుమంది గంధర్వులు, కపిలకు అమృతం, గోవులు, బ్రాహ్మణులు, అప్సరసలు జన్మించారు. వినతకు అనూరుడు, గరుడుడు పుట్టారు. క్రోధకు క్రోధవశగణం, ప్రాధకు సిద్ధాదులు, క్రూరకు సుచంద్రాదులు జన్మించారు. కద్రువకు శేషుడు, వాసుకి మొదలైనవారు పుట్టారు.)

No comments: