Sunday, October 30, 2005

1_3_69 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు స్థాణునకు మానసపుత్త్రులైన మృగవ్యాధ శర్వ నిరృత్యజైక పాద హిర్బుధ్న్య పినాకి దహనేశ్వర కపాలి స్థాణు భవు లనంగా నేకాదశ రుద్రులు పుట్టిరి మఱి బ్రహ్మదక్షిణ స్తనంబున ధర్ముండను మనువు పుట్టె వానికి శమ కామ హర్షు లనంగా మువ్వురు పుట్టిరి యా మువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నందు లనంగా మువ్వురు భార్య లైరి సవితృనకు బడబా రూపధారిణి యైన త్వాష్ట్రికి నశ్వినులు పుట్టిరి బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె వానికిఁ గవి పుట్టె వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుండయ్యె వానికిఁ జండామర్క త్వష్టృ ధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి వా రసురులకు యాజకు లైరి మఱియును.

(బ్రహ్మ శరీరభాగాలనుండి పుట్టినవారిలో హృదయంనుండి పుట్టిన భృగుడికి కవి, ఆ కవికి శుక్రుడు జన్మించారు. శుక్రుడు రాక్షసులకు గురువు అయ్యాడు.)

No comments: