Saturday, October 29, 2005

1_3_59 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

అనిన విని జనమేజయునకు వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి సకలజగ దుత్పత్తినిమిత్తభూతుం డైన బ్రహ్మకు మానసపుత్త్రు లైన మరీచియు నంగీరసుండును నత్రియుఁ బులస్త్యుండును బులహుండును గ్రతువును నను నార్వురు పుట్టి రందు మరీచికిఁ గశ్యప ప్రజాపతి పుట్టెఁ గశ్యపు వలనఁ జరాచర భూతరాశియెల్ల నుద్భవిల్లె నెట్లనిన బ్రహ్మదక్షిణాంగుష్ఠంబున దక్షుండును వామాంగుష్ఠంబున ధరణియను స్త్రీయునుం బుట్టిన యయ్యిరువురకును.

(అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు: బ్రహ్మదేవుడి ఆరుగురు మానసపుత్రులలో ఒకడైన మరీచికి కశ్యపప్రజాపతి పుట్టాడు. కశ్యపుడి నుండి చరాచరజీవాలన్నీ ఉద్భవించాయి. ఎలాగంటే - బ్రహ్మ కుడిచేతి బొటనవేలు నుండి దక్షప్రజాపతి, ఎడమచేతి బొటనవేలినుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారిద్దరికీ.)

No comments: