Sunday, October 30, 2005

1_3_61 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

పదంపడి యేఁబండ్రు గూఁతులుం బుట్టిన వారల నెల్ల దక్షుం డపుత్త్రకుండు గావునఁ బుత్త్రీకరణంబు సేసి యందుఁ గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతులను వనితలఁ బదుండ్రను ధర్ముండను మనువున కిచ్చె నశ్విన్యాదులైన యిరువదేడ్వురను జంద్రున కిచ్చె నదితి దితి దను కాలానాయు స్సింహికా ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువలను పదుమువ్వురను గశ్యపున కిచ్చె నం దదితి యనుదానికి ధాతృ మిత్రార్యమశక్ర వరుణాంశు భగవివస్వత్పూష సవితృ త్వష్టృ విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి మఱియును.

(దక్షుడికి యాభైమంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదిమందిని ధర్ముడికి, ఇరవై ఏడుమందిని చంద్రుడికి ఇచ్చాడు. అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, వినత, క్రోధ, ప్రాధ, క్రూర, కద్రువ అనే పదమూడు మందిని కశ్యపుడికి ఇచ్చాడు. వారిలో అదితికి ద్వాదశాదిత్యులు జన్మించారు.)

No comments: