Saturday, October 29, 2005

1_3_48 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు దేవదైత్యదానవ మునియక్షపక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారతయుద్ధంబు సేయ ననేకులు పుట్టిరి వారల కొలంది యెఱుంగచెప్ప ననేకకాలం బనేక సహస్రముఖంబుల వారికైన నలవిగా దనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(అంతేకాక దేవతలు, రాక్షసులు మొదలైనవారి అంశలతో భీష్ముడు మొదలైన మహావీరులు భారతయుద్ధం చేయటానికి పుట్టారు. వారందరి సామర్ధ్యం గురించి చెప్పటం అనేకవేల ముఖాలు కలవారు చాలాకాలం చెప్పినా సాధ్యం కాదు - అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

No comments: