Tuesday, October 04, 2005

1_2_25 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

ఇట్లు సముద్రతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్ధం బయ్యె నందు నరనారాయణు లపారపరాక్రములైయసురవీరులఁ బెక్కండ్ర జంపిన నుక్కడంగి దెసచెడి యసురులు సముద్రంబు సొచ్చిన నమరులు సమరలబ్ధ విజయులై యమరపతి నమృతరక్షణార్థంబు ప్రార్థించి యథాస్థానంబున మంథరనగంబుఁ బ్రతిష్ఠాపించి తమతమ నివాసంబులకుం జని సుఖంబుండి రంత.

(ఇలా సముద్రతీరంలో జరిగిన పోరాటంలో నరనారాయణుల పరాక్రమం వల్ల రాక్షసులు చెల్లాచెదురై, దిక్కులేక సముద్రంలో ప్రవేశించారు. దేవతలు యుద్ధంలో గెలిచి, అమృతాన్ని రక్షించటంకోసం ఇంద్రుడిని ప్రార్థించి, మంథరపర్వతాన్ని అంతకు ముందుండే చోట మళ్లీ నిలిపి, వారి వారి నివాసాలకి వెళ్లి సుఖంగా ఉన్నారు.)

No comments: