Sunday, February 19, 2006

1_4_200 వచనము పవన్ - వసంత

వచనము

బ్రాహ్మంబు మొదలుగాఁ గల యెనిమిదివివాహముల యందు క్షత్త్రియులకుగాంధర్వరాక్షసంబు లుత్తమంబులు స్వయంవరంబున జయించి వివాహంబగుట యంతకంటె నత్యుత్తమంబు గావున నిమ్మూఁగిన రాజలోకంబు నెల్లనోడించి యిక్కన్యలం దోడ్కొని నాచనుట యిది ధర్మంబయని కాశీరాజునకుం జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పుడు.

(స్వయంవరంలో రాజులను ఓడించి ఈ కన్యలను తీసుకొనిపోవటం న్యాయమే - అని కాశీరాజుకు చెప్పి వీడ్కోలు పలికి భీష్ముడు తిరిగి వస్తూ ఉండగా.)

No comments: