Monday, February 20, 2006

1_4_239 వచనము వసు - విజయ్

వచనము

అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి దనకన్యయైయున్నకాలంబునఁ బరాశరుండు దన్నుఁ గామించుటయు నమ్మునివరంబునఁ దనకన్యాత్వంబు దూషితంబు గాకునికియుఁ దత్ప్రసాదంబునం జేసి యమునాద్వీపంబునఁ గృష్ణద్వైపాయనుండు గానీనుం డయి సద్యోగర్భంబునఁ బుట్టి పనిగలయప్పుడ తన్నుఁ దలంచునది యని చెప్పి తపోవనంబునకుం జనుటయును భీష్మునకుం జెప్పి నిజతపోదహన దగ్ధపాపేంధనుండయిన కృష్ణద్వైపాయనుం డఖిలధర్మమూర్తి నిత్యసత్యవచనుండు నా నియోగంబున నీ యనుమతంబున భవద్భ్రాతృక్షేత్రంబులయందు సంతానంబు వడయు ననిన నమ్మహర్షి కీర్తనంబు విని భీష్ముండు కరకమలంబులు మొగిచి వ్యాసభట్టారకుఁ డున్న దిక్కునకు మ్రొక్కి తొల్లి జగంబు లుత్పాదించిన యాదిమబ్రహ్మకుం గల సామర్థ్యంబు గల వేదవ్యాసుం డిక్కురువంశంబుఁ బ్రతిష్ఠించునది యెల్లవారికి నభిమతంబ యనిన సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశర్యుం దలంచుడు నాక్షణంబ.

(అన్న భీష్ముడి మాటలకు సత్యవతి సంతోషించి వ్యాసుడి గురించి అతడికి చెప్పింది. వ్యాసుడు కురువంశం నిలపటం తనకు సమ్మతమేనని భీష్ముడు అనగా సత్యవతి వ్యాసుడిని మనసులో తలచుకోగానే.)

No comments: