Wednesday, February 22, 2006

1_4_268 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికిన పలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెఱింగించిన రాజునుం బఱతెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి నాచేసిన యజ్ఞానంబు సహించి నాకుం బ్రసాదింపవలయునని శూలంబువలన నమ్మునింబాచుచోనది పుచ్చరాకున్న దానిమొదలు మెత్తన తునిమించినఁ దత్కంఠపార్శ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె దానం జేసి యాముని యాణిమాండవ్యుండునాఁ బరఁగుచు నమ్మహాముని ఘోరతపంబు సేసి యెల్లలోకంబులు గమించి యొక్కనాఁడు యమునిపురంబునకుం జని ధర్మరాజున కిట్లనియె.

(ఈ మాటలు విన్న భటులు రాజుకు తెలుపగా అతడు వెంటనే బయలుదేరివచ్చి, మాండవ్యుడికి మొక్కి, క్షమించమని కోరాడు. శూలంనుండి మునిని విడిపించబోగా అది వీలుకాకపోవటంతో దాని మొదలును నరికించాడు. శూలభాగం ఒకటి అతడి శరీరంలోనే ఉండిపోయింది. దానివల్ల ఆ మునికి ఆణిమాండవ్యుడు అనే పేరు కలిగింది. మాండవ్యుడు తర్వాత గొప్పతపస్సు చేసి లోకాలను దాటి ఒకరోజు యముడి నగరానికి వెళ్లి యముడితో ఇలా అన్నాడు.)

No comments: