Wednesday, February 22, 2006

1_4_255 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కృష్ణద్వైపాయనుండును దానికింబుత్త్రదానంబు సేసి యాయంబికయందు బలపరాక్రమవంతుం డయిన కొడుకు పుట్టు వాఁడు మాతృదోషంబున నంధుం డగు ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం గృష్ణద్వైపాయనుం బ్రార్థించి యింక నంబాలికయం దొక్కకొడుకుం బడయుమని నియోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన నదియుం దనవేషంబునకు వెఱచి వెల్లనైయున్న నక్కోమలికిం బుత్త్రదానంబు సేసి యీయంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు నగుపుత్త్రుండు పుట్టు వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగునని చెప్పి యరిగిన.

(వ్యాసుడు ఆమెకు దేహబలం, పరాక్రమం ఉన్న పుత్రుడు జన్మిస్తాడనీ, కానీ తల్లి కళ్లుమూసుకోవటం వల్ల గుడ్డివాడవుతాడనీ చెప్పాడు. సత్యవతి విచారం చెంది, అంబాలికకు కూడా ఒక పుత్రుడిని అనుగ్రహించమని వ్యాసుడిని ఆజ్ఞాపించింది. ఆమె కూడా వ్యాసుడి వేషాన్ని చూసి తెల్లబోగా ఆమెకు గొప్పదేహబలం, పౌరుషం ఉన్న పుత్రుడు, వంశాన్ని నిలిపేవాడై జన్మిస్తాడు కానీ అతడికి పాండువర్ణం కలుగుతుందని చెప్పి వెళ్లిపోయాడు.)

No comments: