Sunday, October 09, 2005

1_2_139 వచనము కిరణ్ - వంశీ

వచనము

తపస్స్వాధ్యాయబ్రహ్మచర్యవ్రతంబులం జేసి ఋషులఋణంబుల
నీఁగుచుఁ బరిభ్రమించువాఁడు వనంబులో నొక్కపల్వలంబు గని యందు
మూషికవిలూనంబయి యొక్కమూలంబు తక్కియున్న వీరణతృణ
స్తంబంబు నవలంబించి తలక్రిందై యాదిత్యకిరణంబు లాహారంబుగా
వ్రేలుచున్న ఋషుల గొందఱం జూచి డాయం బోయి జరత్కారుండిట్లనియె.

(ఇలా తిరిగే జరత్కారుడికి ఒకరోజు అడవిలో ఒక కొలను కనిపించింది. అందులో ఎలుకలు కొరకటంచేత ఒక్కవేరు మాత్రమే మిగిలి ఉన్న గడ్డిదుబ్బును పట్టుకొని తలకిందులుగా, సూర్యకిరణాలే ఆహారంగా, వేలాడుతున్న కొందరు మునులను చూసి ఇలా అన్నాడు.)

No comments: