Saturday, October 15, 2005

1_2_192 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

ఇప్పురంబున బ్రాహ్మణుం డిందానర్థ
మేఁగి మున్న యావృక్షంబు నెక్కి దాని
తోన దగ్ధుఁడై మఱి దానితోన లబ్ధ
జీవుఁడై వచ్చి జనులకుఁ జెప్పె దీని.

(హస్తినాపురం నుండి అడవికి వెళ్లి, కట్టెల కోసం ఆ చెట్టునెక్కి ఉన్న బ్రాహ్మణుడు ఒకడు తక్షకుడి విషప్రభావానికి ఆ చెట్టుతోనే భస్మమైపోయి కశ్యపుడి మహిమ వల్ల ప్రాణాన్ని తిరిగిపొందివచ్చి ప్రజలకు ఈ విషయాన్ని చెప్పాడు.)

No comments: