Saturday, October 15, 2005

1_2_193 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట్లు కశ్యపుం గ్రమ్మఱించి తక్షకుండు తత్క్షణంబ నాగకుమారులం బిలిచి మీరలు విప్రుల రయి సురభికుసుమస్వాదువన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితుపాలికిం జని యిం డని పంచి తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన.

(తక్షకుడు అలా కశ్యపుడిని మరల్చి, సర్పకుమారులను పిలిచి వారితో, "మీరు బ్రాహ్మణరూపాలు ధరించి, పూలను, పండ్లను, బుట్టలలో పెట్టుకొని పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి ఇవ్వండి", అని, తాను కూడా వారివెంట అదృశ్యరూపంలో వెళ్లాడు.)

No comments: