Sunday, February 19, 2006

1_4_158 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు దక్షప్రజాపతి పుత్త్రి యయిన సురభికిం గశ్యపునకుం బుట్టిన నందిని దనకు హోమధేను వయి కోరిన వస్తువులు గురియుచుండఁ దపంబు సేయుచున్న వసిష్ఠునాశ్రమంబునకు వసువులెనమండ్రును భార్యాసహితులై క్రీడార్థంబు వచ్చి వసిష్ఠు హోమధేనువుం జూచి దానిశీలంబునకు విస్మయంబందుచున్నచో నం దష్టమవసుభార్య పతి కి ట్లనియె.

(కాగా, దక్షప్రజాపతి కూతురైన సురభికీ, కశ్యపుడికీ పుట్టిన నందిని అనే కామధేనువు సహాయంతో నిశ్చింతగా తపస్సు చేస్తున్న వసిష్ఠుడి ఆశ్రమానికి ఒకసారి ఎనిమిదిమంది వసువులూ తమ భార్యలతో వచ్చి, వసిష్ఠుడి హోమధేనువును చూసి, ఆశ్చర్యపడుతూ ఉండగా ఎనిమిదవ వసువు భార్య తన భర్తతో ఇలా అన్నది.)

No comments: