Monday, March 27, 2006

1_5_57 వచనము పవన్ - వసంత

వచనము

తొల్లి యగస్త్య మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండ నిర్మించె దీని నీకు నిందింపఁదగునే యనుచున్న నమ్మృగంబులు బాణఘాతక్షతవేదన సహింపనోపక సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితి గావున నీవునుం బ్రియాసంగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు మని నీ ప్రియయు నిన్ను ననుగమించు నని పాండురాజునకు శాపం బిచ్చి గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి శోకించి పాండురాజు పరమనిర్వేదనపరుం డయి.

(పూర్వం అగస్త్యుడు రాజులకు మృగవధదోషం లేకుండా చేశాడు. కాబట్టి నువ్వు నన్ను నిందించటం తగదు - అని అంటూ ఉండగా ఆ మృగాలు బాణం వల్ల కలిగిన బాధ ఓర్చుకోలేక - సంభోగసమయంలో ఉండగా మమ్మల్ని చంపావు. నువ్వు కూడా అలాగే మరణిస్తావు. నీ భార్యకూడా మరణిస్తుంది - అని శాపమిచ్చి చనిపోయాయి. పాండురాజు నిరాశ చెంది.)

No comments: