Wednesday, November 02, 2005

1_3_102 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని నెఱింగి దేవతలెల్ల నతి భీతులై యసురుల నోర్వనోపక శుక్రువలన మృతసంజీవని వడసి తేనోపునట్టి మహాసత్త్వుం డెవ్వం డగునో యని విచారించి బృహస్పతిపుత్త్రుం డయిన కచుని కడకుం జని యిట్లనిరి.

(ఇది తెలిసి దేవతలు భయపడి, శుక్రుడి దగ్గర మృతసంజీవని నేర్చుకొని రాగల సమర్థుడెవరా అని ఆలోచించి బృహస్పతి పుత్రుడైన కచుడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు.)

No comments: