Sunday, November 06, 2005

1_3_190 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఏ నిద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను జరాభారంబుఁ దాల్ప నోప నని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి యట్లేని నీ ముదిమి నీకొడుకులయం దొక్కరునిపయిం బెట్టి వాని జవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము నీవు విషయోపభోగ తృప్తుండ వైన మఱి నీ ముదిమి నీవ తాల్చి వానిజవ్వనంబు వానికి నిచ్చునది నీముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీసహితుం డై తన పురంబునకు వచ్చి శుక్రుశాపంబున జరాభారంబుఁ దాల్చిన వానికి.

(నేను ముసలితనాన్ని వహించలేను అని ప్రార్థించగా శుక్రుడు, "నీ కుమారులలో ఒకరికి నీ ముసలితనమిచ్చి వారి యౌవనం నువ్వు గ్రహించు. నువ్వు తృప్తిపొందిన తరువాత యౌవనం తిరిగి ఇచ్చి ఆ కుమారుడికే నీ రాజ్యం ఇవ్వు. అతడే నీ వంశాన్ని కొనసాగిస్తాడు", అన్నాడు. శుక్రుడి శాపం ప్రకారం యయాతి ముసలితనం పొందాడు.)

No comments: