Sunday, November 06, 2005

1_3_195 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యొడంబడకున్న నలిగి యయాతి యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ దుర్వసువంశంబునవారు ధర్మాధర్మవివేకశూన్యు లై సంకీర్ణవర్ణ కిరాతులకు రాజులుగా ద్రుహ్వ్యువంశంబునవా రుడుపప్లవసంతార్యం బైన దేశంబునకు రాజులుగా జరాదూషకుండగుట ననువంశంబునవారు ముదియు నంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగవారునుంగా శాపం బిచ్చి యానలువురకుం గొండుకవాని శర్మిష్ఠాపుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన వాఁడు దండ్రికోరియనయట్ల చేసిన నవయౌవనుండై యయాతి యభిమతసుఖంబులు సహస్రవర్షంబు లనుభవించి తృప్తుండై పూరుజవ్వనంబు వానిక యిచ్చి తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞావిధేయచతురంతమహీతలబ్రహ్మక్షత్త్రాది వర్ణముఖ్యులనెల్ల రావించి మంత్రిపురోహిత సామంత పౌరజన సమక్షంబున సకలక్షోణీచక్రసామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుంజేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి.

(అని పలికి ముసలితనం గ్రహించడానికి ఒప్పుకోలేదు. యయాతి కోపగించి యదువు వంశం వారు రాజ్యానికి అయోగ్యులని శపించి మిగిలిన ముగ్గురికి కూడా శాపాలు ఇచ్చాడు. పూరుడు మాత్రం తన యౌవనం తండ్రికి ఇచ్చి ముసలితనం పొందాడు. యౌవనం పొందిన యయాతి చాలాకాలం సుఖాలు అనుభవించి, తృప్తిపొంది, యౌవనాన్ని పూరుడికి తిరిగి ఇచ్చి అతడికే రాజ్యాభిషేకం చేశాడు. అప్పుడు ప్రజలు రాజుతో ఇలా అన్నారు.)

No comments: